Suspension | టిటిడి ప‌ర‌కామ‌ణి లెక్కింపులో చేతివాటం – ఉద్యోగి స‌స్పెన్ష‌న్

తిరుపతి: చెన్నైలో టిటిడి కు చెందిన శ్రీవారి ఆలయ పరకామణి లెక్కింపులో చేతివాటం ప్ర‌ద‌ర్శించిన ఉద్యోగిని నేడు సస్పెండ్ చేశారు. వివ‌రాల‌లోకి వెళితే శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో ఉద్యోగి కృష్ణకుమార్ చేతివాటం ప్రదర్శించారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించారు. ఆ కరెన్సీ లెక్కింపులో తేడా ఉన్నట్లు గుర్తించిన టిటిడి విజిలెన్స్ విభాగం.. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కృష్ణకుమార్ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధరించింది. ఈ మేరకు ఈవో శ్యామలరావుకు నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా కృష్ణకుమార్ ను ఈవో సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడు ఆయ‌న జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *