Rally | మరికొద్దిసేపట్లో ఆర్మీకి సంఘీభావంగా ర్యాలీ .. పాల్గొననున్న రేవంత్

హైదరాబాద్ – భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాలీ నిర్వహించనుంది.

ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా నిలబడాలని కోరారు. భారత్‌ – పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌ సూచించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *