Hon’ble CM Sri. A. Revanth Reddy participates in Inauguration of HYDRAA PS at Buddha Bhavan
హైదరాబాద్ : భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల అట్టడుగు లోతు కల్పించేవి వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడమనే నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మితమైన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా హైడ్రా సంస్థకు మద్దతుగా నిర్మించబడింది. ఇది G+2 (జీ ప్లస్ 2) అంతస్తులతో ఏర్పాటైంది. 10,500 చ.అ. (చదరపు అడుగులు) విస్తీర్ణంలో స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మించారు.

హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ తిరుమల్ ఎస్హెచ్వోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ స్టేషన్లో ఆరు మంది ఇన్స్పెక్టర్లు, 12 మంది సబ్ఇన్స్పెక్టర్లు (SIలు), 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. పూర్తి స్థాయి బలగాలతో ఈ స్టేషన్ కార్యాచరణ ప్రారంభించనుంది.
ఈ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములు వంటి వాటిపై జరిగిన ఆక్రమణల కేసులపై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన పలు భూకబ్జా కేసులను, నూతనంగా ఏర్పాటైన హైడ్రా పోలీస్ స్టేషన్కు బదిలీ చేసే అవకాశముంది. దీనివల్ల సంబంధిత వ్యవహారాలపై మరింత వేగంగా స్పందించేందుకు, నిర్భయంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
ఇప్పటి వరకు హైడ్రా విభాగం అధికారికంగా సమన్వయ చర్యలు చేపట్టే స్థాయిలో ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్తో అనుసంధానమవడం వల్ల ఈ విభాగానికి మరింత అదనపు బలం లభించనుంది. డిజాస్టర్ , ఫైర్ విభాగాల మాదిరిగా, హైడ్రా కూడా స్వంతంగా కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేపట్టడం వంటి అధికారం కలిగిన వ్యవస్థగా ఎదుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువుల దుస్థితి వంటి అంశాలు నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఈ సమస్యలను పట్టించి తగిన చర్యలు తీసుకోవడంలో హైడ్రా పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషించనుంది.