Flood Flow | శ్రీశైల జలాశయానికి వ‌ర‌ద పోటు

ఎగువ కృష్ణమ్మ నుంచి 59938 క్యూసెక్కులపైగా ప్రవాహం.
సుంకేసుల నుంచి సైతం వరద నీరు.
కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు మూలంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోని గద్వాల జిల్లా, జూరాల ప్రాజెక్టు వరద పో టెత్తుతుంది. ముఖ్యంగా జూరాల ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులలో కనిష్ట స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

దీంతో ఆ నీరు నేరుగా జురాలకు చేరుతుంది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టులో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు చేసుకుని స్పిల్ వే గేట్లతోపాటు, పవరు ఉత్పత్తి, వివిధ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం 59938 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం ఉంది. ఇక జలాశయం నుంచి సుమారు 53 వేల క్యూసెక్కులు నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్ వే గేట్ల ద్వారా 30702 క్యూసెక్కులు, పవర్ హౌస్ నుంచి 22626 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. మొత్తం 12 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదే సమయంలో సుంకేసుల బ్యారేజీ నుంచి 6610 క్యూసెక్కుల నీరు తుంగభద్ర కి విడుదలవుతుంది. అటు జూరాల, ఇటు తుంగభద్ర నుంచి శ్రీశైల జలాశయం కు వరద పో టెత్తుతుంది. దీంతో శ్రీశైల జలాశయంలో నీటి నిలువలు ప్రస్తుతం 885 అడుగులకు గాను 826.10 అడుగులకు చేరుకున్నాయి. ఇక జలాశయంలో 45.7586 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో గడిచిన 24 గంటల వ్యవధిలో డ్యాం పరిధిలోని ఏపీ కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 638 క్యూసెక్కుల నీటిని వినియోగించి 0.291 మెగా యూనిట్లు, తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 1095 క్యూసెక్కుల నీటి వినియోగం ద్వారా 0.484 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *