Jaipur | క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపులు

జైపూర్ : ఆపరేషన్ సిందూర్‌ తర్వాత దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పెంచుతున్నారు. ఇప్పటికే 200కు పైగా విమానాలను రద్దు చేయడంతోపాటు 18 ఎయిర్ పోర్టులను మూసివేశారు. ఈ క్రమంలో జైపూర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఐపిఎల్‌ మ్యాచ్‌లకు వేదికైన జైపూర్ లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్ స్టేడియానికి గురువారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.

స్టేడియాన్ని పేల్చేస్తామని బెదిరింపు రావడంతో జైపూర్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. జైపూర్‌ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసులు మోహరించారు. స్టేడియం లోపల ఉన్నవారందరనీ బయటకు పంపించి పోలీసులు. స్టేడియం చుట్టుపక్కల ఉన్నవారినీ ఖాళీ చేయించి..స్టేడియం లోపల, వెలుపల బాంబు స్వ్కాడ్‌లతో పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ స్టేడియం వేదికగా మే 16న పంజాబ్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది.

Leave a Reply