Stock Market | మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి
Stock Market | మార్కెట్లపై అమ్మకాల ఒత్తిడి
Stock Market | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రభావంతో రోజంతా సూచీలు ఒడిదొడుకులకు లోనయ్యాయి. చివరికి కీలక సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 116 పాయింట్లు కోల్పోయి 74,243 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 49 పాయింట్లు నష్టపోయి 23,366 స్థాయికి చేరింది. ఐటీ, మెటల్ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది.
మరోవైపు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.94 వద్ద కొనసాగింది. ఆర్బీఐ విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, విదేశీ పెట్టుబడిదారుల కదలికలు మార్కెట్ ధోరణిని ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
