HYD | చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో గల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిన్న తెల్లవారుజమున జరిగిన చోరికి సంబంధించి ఇద్దరు నిందితులను జీడిమెట్ల పోలిసులు అరెస్టు చేశారు..

నిందితుల వద్ద నుండి దేవాలయంలో దొంగిలించిన ఆభరణాలు, పూజా సామాగ్రి (నాగ భరణం, పంచలోహ విగ్రహాలు, హారతి పళ్లెం, నీటిదార పాత్ర) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించామని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *