హైదరాబాద్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును ప్రభుత్వం నియమించింది. శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆమె.. స్థానంలో రామకృష్ణారావుకు బాధ్యతలు అప్పగించింది.
గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్గా శశాంక్ గోయల్ను నియమించింది. ఇండస్ట్రీ, ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈవోగా జయేశ్ రంజన్, పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్కుమార్కు బాధ్యతలు అప్పగించింది.
ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రెటరీగా స్మితా సబర్వాల్, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా దాన కిశోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఎండీఏ వెలుపల) టీకే శ్రీదేవి, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా (హెచ్ఎండీఏ పరిధి) ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ను నియమించింది. ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా కే శశాంక, జెన్కో సీఎండీగా ఎస్ హరీశ్, రాష్ట్ర మానవహక్కుల కమిషనర్ సెక్రటరీ-సీఈవోగా నిఖిల, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణ, దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవోగా ఎస్ వెంకటరావు, సెర్ప్ అదనపు సీఈవోగా పీ కాత్యాయనీదేవి, ఇండస్ట్రీ-ఇన్వెస్ట్మెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్రావు, టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఫణీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్గా కధివరన్, హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్, పీ ఉపేంద్రారెడ్డి (నాన్కేడర్)ని హెచ్ఎండీఏ సెక్రెటరీగా నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.