AP | ఆర్థికంగా చితికిపోయాం .. ఎక్కువ నిధుల‌కు సిఫార్స్ చేయండి : కేంద్ర ఆర్థిక సంఘానికి చంద్ర‌బాబు విన‌తి

అమరావతి: గ‌త అయిదేళ్ల‌లో ఆర్థికంగా చితికిపోయాం… ఉదారంగా కేంద్రం సాయం అందించేలా ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక సంఘానికి విజ్ఞ‌ప్తి చేశారు ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. కేంద్రం ప్ర‌స్తుత ఇస్తున్న సాయంతో కొంత‌ముందుకు వెళుతున్నా గ‌తంలో చేసిన అప్పులు, వాటికి అవుతున్న వ‌డ్డీల‌తో ప్ర‌గ‌తి రథం ముందుకు క‌ద‌ల‌డం లేద‌ని వారికి దృష్టికి తెచ్చారు.. కాగా , పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యట‌న‌కు అమ‌రావ‌తికి చేరుకుంది.. ఈ సంద‌ర్భంగా ఈ సంఘ ప్ర‌తినిధులు చంద్ర‌బాబు ఏర్పాటు చేసిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో పాల్గొన్నారు.
ముందుగా స‌చివాల‌యానికి చేరుకున్న ఆర్థిక సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వ‌యంగా స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చరుల‌ను , ఉన్న‌త స్థాయి అధికారుల‌ను ఆయ‌న పేరు పేరునా ప‌న‌గారియాకు ప‌రిచ‌యం చేశారు.


అనంత‌రం రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫొటో ఎగ్జిబిషన్ ను ఈ సంఘం ప్ర‌తినిదులు తిల‌కించారు.. ఫొటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.


కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి వివరించారు. గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అదనపు సాయం చేయాలని.. దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు.


రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్- 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సీఎం చంద్రబాబు వారికి వివరించారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను వివరించారు. గత ఐదేళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు..

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు , ఆర్ధిక శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

వివిధ పార్టీల ప్ర‌తినిదుల‌తో భేటి

ఇక చంద్ర‌బాబుతో స‌మావేశం ముగిస‌న తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడనున్నారు. ఇక సాయంత్రం నోవాటెల్ హోటల్లో ఆర్థిక సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించ‌నున్నారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు విజయవాడలోని బెర్మ్ పార్కులో ముఖ్యమంత్రి ఇచ్చే డిన్నర్‌కు హాజరవుతారు. రాత్రి పది గంటలకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరి వెళతారు. గురువారం మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం అవుతారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవర్గాలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *