అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయి ఆత్మహత్యతో అతని మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు.
సాయి ఫోన్ లాక్ చేసి ఉండటంతో… కుటుంబ సభ్యులకు ఎలా తెలియజేయాలో తెలియక మీడియాకు సమాచారం అందించారు. సాయికుమార్ రెడ్డి ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.