HYD | ఎన్టీఆర్ ఘాట్ కు కొత్త శోభ

హైద‌రాబాద్ : ఎన్టీఆర్ వర్ధంతి రోజు చాలామంది ప్రముఖులు, అభిమానులు హైదరాబాద్ సచివాలయం పక్కనే వున్న ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) ను సందర్శించారు! ఎప్పటిలాగే జిహెచ్ఎంసి పుష్పాలంకరణ చేయించింది! అందరూ ఫోటోలకు పొజిచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లారు! కానీ ఒక్కడు మాత్రం పరిసరాలు చూసి అసహనం వ్యక్తం చేశాడు! అతడే ఎన్టీఆర్ మనవడు, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ! గ్రిల్స్ విరిగి ఉండటం, గేటు నుంచి ఘాట్ వరకు రోడ్డు దారుణంగా ఉండటం, సమాధి కూడా పెచ్చులు ఊడిపోయి ఉండటాన్ని ఆయన గమనించారు. ఎన్టీఆర్ ఘాట్ నవీకరణ కు ప్రత్యేక అనుమతి ఇస్తే, తన సొంత ఖర్చుతో బాగు చేసుకుంటామని సంబంధిత అధికారితో మాట్లాడారు. అవసరమైతే ప్రత్యేకంగా లెటర్ రాస్తానని చెప్పారు.

కానీ, హెచ్ఎండిఎ (HMDA) అధికారులు సున్నితంగా తిరస్కరించి ఆ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. గత రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. నిజానికి ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతుల కోసం 1.3 కోట్ల రూపాయలు వర్ధంతికి ముందే మంజూరయ్యాయి! పనులు నత్తనడక నడుస్తున్నాయి! ఇప్పుడు నవీకరణ పనులు వేగవంతం చేశారు. ఒక వారం రోజుల పాటు సందర్శకులకు ప్రవేశం లేదని నిర్వాహకులు చెప్పారు. పది రోజుల్లో ఆధునీకరణ పనులు పూర్తి చేసి రంగులు వేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply