హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో ఓ చిరుతపులి తిగుతున్నది. దీంతో సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించిన అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించారు.
దీంతో బుధవారం ఇక్రిశాట్లో సీసీ కెమెరాలు, బోనును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అది బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత పట్టుబడటంతో శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత పులిని హైదరాబాద్ జూ పార్కుకు తరలించనున్నారు.