HCU Lands – నేడు కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై సుప్రీంకోర్టు లో విచారణ

న్యూఢిల్లీ : కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో, ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ కేసుపై కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ అంశం సామాజిక, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

భూములను చదును చేసే పనులు ప్రారంభించడంతో, సుప్రీం కోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి తాత్కాలికంగా అన్ని పనులపై స్టే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.20 ఏళ్లుగా వివాదంలో భూములుఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో, కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవే అని స్పష్టంగా పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఈ భూములు న్యాయపరమైన వివాదాల్లో ఉండటంతో ఆ స్థలంలో చెట్లు పెరిగాయని కూడా అఫిడవిట్‌లో వివరించారు. భూములపై ఉన్న వివాదాల కారణంగా ఈ ప్రాంత అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు.

సుప్రీం కోర్టులో జరిగే విచారణపై ఆసక్తిఇక నేడు సుప్రీం కోర్టులో జరిగే విచారణను అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ కేసు తీర్పు రాష్ట్ర భూ నిర్వహణ విధానాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఇదే సమయంలో ఈ భూములపై హక్కులను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు న్యాయస్థానం తీర్పుతో ఈ వివాదానికి ముగింపు పడుతుందా? లేక మరింత రాజకీయ, న్యాయ ప్రక్రియలద్వారా దీర్ఘకాలంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *