1st time | చరిత్రలో తొలిసారి..

1st time | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో మిడిల్ ఈస్ట్లోని ప్రధాన విమానాశ్రయాలు ఒక్కసారిగా మూసివేయబడ్డాయి. దుబాయ్, దోహా, అబుదాబి ఎయిర్పోర్టులు పూర్తిగా మూతపడ్డాయి. చరిత్రలో తొలిసారిగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయబడింది. గత 48 గంటల్లో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మొత్తం 3,200 విమానాలు రద్దు చేయబడ్డాయి.
ఇందులో భారత్ నుంచి మాత్రమే 750 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మృతి తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలు విమాన రద్దులు, ఎయిర్స్పేస్ మూసివేతలకు దిగాయి.
