చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మధ్య జరుగున్న ఉతక్కంఠ పోరులో… బెంగళూరు జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. కోహ్లీ తరువాత క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్స్టోన్ (10) ఔటయ్యాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు లివింగ్స్టోన్.
దీంతో 16 ఓవర్లకు ఆర్సీబీ 153 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. కాగా ప్రస్తుతం కెప్టెన్ రజత్ పటీదర్ (38) తో పాటు జితేశ్ శర్మ ఉన్నారు.
ఈమ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఆర్సీబీ తొలి బ్యాటింగ్ చేపట్టింది.