ట్విట్టర్ వేదికగా రేవంత్ థ్యాంక్స్
రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్ నేతలు
హైదరాబాద్ – ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు తెలంగాణ ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు..అని ఎక్స్లో ట్విట్ చేశారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/TelanganaCMO/status/1895520743485817327
వరంగల్ నేతలు భేటి
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరంగల్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు రేవంత్ ను హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో కలసిన నేతలు బోకే ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ , ఎంపీలు కావ్య , పి బలరాం రు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి , నాయిని రాజేందర్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , కేఆర్ నాగరాజు , డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.