బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న పెద్దచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని బీబీనగర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న అభిజిత్ (23)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. పోస్ట్ మార్టమ్ కోసం భౌతికకాయాన్ని హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
TG | బీబీ నగర్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య
