ఘోర రోడ్డు ప్రమాదం…

ఘోర రోడ్డు ప్రమాదం…
కంచికచర్ల, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

