Wishes | కేంద్ర సాహిత్య పుర‌స్కారం – ర‌చ‌యిత ప్ర‌సాద్ కు చంద్ర‌బాబు విషెస్

మంగ‌ళ‌గిరి – యువ రచయిత ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్) (prasd suri) ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య (central literature) యువ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandra babu ) ఆయనకు హృదయపూర్వక అభినందనలు (wishes) తెలిపారు. పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి, సాహిత్యంపై మక్కువతో అద్భుతమైన ప్రతిభ కనబరచడం ఎంతో సంతోషాన్నిచ్చే విషయమని కొనియాడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి సాహిత్యంపై మక్కువతో రాసిన రెండో నవలకే ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇంతటి అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్)కి అభినందనలు. సముద్రపు లోతు చూసే మత్స్యకారులకు మనిషి జీవితపు ఎత్తుపల్లాలు చూడడం కష్టమేమీ కాదు అని నిరూపించిన ప్రసాద్ సూరి రానున్న రోజుల్లో సాహిత్యపు శిఖరం తాకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రానికి, తను జన్మించిన జాతికి ఎనలేని ప్రతిష్ఠ తెచ్చిపెట్టిన ప్రసాద్ సూరికి మరొక్క మారు శుభాభినందనలు” అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

నారా లోకేష్ ..

” ‘మైరావణ’ నవలకు గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్న యువ రచయిత సూరాడ ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లికి చెందిన ప్రసాద్ గారు తెలుగుసాహిత్యంపై మక్కువతో అద్భుతమైన రచనలు చేశారు. తన రెండో నవలకే ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం ప్రశంసనీయం. మత్స్యకార గ్రామం నుంచి ఎదిగిన ప్రసాద్ గారు తన నవలా రచనలతో యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను” అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Leave a Reply