UP | లడ్డూ ఉత్సవంలో అపశృతి – 8మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. చెక్క వేదిక కూలి 8మంది మృతిచెందగా, 46మందికి గాయాలయ్యాయి. అధికారుల కథనం మేరకు …. యూపీలోని బాగ్‌పత్‌లో ఆదినాథుడి నిర్వాణ లడ్డూ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ చెక్కతో ఏర్పాటు చేసిన వేదికపై యాత్రికులు చేరారు.

అకస్మాత్తుగా ఆ వేదిక కుప్పకూలింది. ఈఘటనలో 8మంది మృతిచెందగా, 50 మందికి పైగా యాత్రికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *