Jagityala | మైనర్ బాలికపై లైంగిక దాడి… దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష !

జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన 24ఏళ్ల వ్యక్తి మర్రిపెల్లి సాయినాథ్‌కు జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అలాగే దోషికి రూ.2,000 జరిమానా కూడా విధించింది. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సి.రత్న పద్మావతి మంగళవారం ఈ తీర్పు ప్రకటించారు.

కోర్టు ఆ బాలికకు రూ.2 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. పోలీసుల వివరాల ప్రకారం, 2021 ఏప్రిల్ 7న సైనాథ్‌పై POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply