దండేపల్లి, ఆంధ్రప్రభ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాక ) తమకు స్ఫూర్తి అని ఆయన అభిమానులు అన్నారు. ఆయన 96 వ జయంతి సందర్భంగా ఈ రోజు మెదరిపేట బస్టాండ్ వద్ద కాకా అభిమానులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెదరిపేట బస్టాండ్ లో అన్నదానం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కాకా అభిమానులు దమ్మ సునీల్, మ్యాడా దయాకర్, రాపల్లి వసంత్, కొండా నరేష్, సంతపురి రాజన్న, బొమ్మేన మహేష్, అక్కల సురేష్, పర్శ మోహన్ దాస్, కొల్లూరి రవి కుమార్, నిరటి, సస్వీక్, దార,శ్రీనివాస్, సంతపురి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
వెంకట స్వామికి ఘన నివాళులు

