ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ బౌండరీల మోతమోగించాడు. కేకేఆర్ నిర్ధేశించిన 175 పరుగుల ఛేదనలో.. విరాట్ తో కలిసి ఓపనర్ గా బరిలోకి దిగిన సాల్ట్.. 2 సిక్సులు 8 ఫోర్లతో 27 బంతుల్లోనే 51 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ కూడా దంచికొడుతున్నాడు. 20 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. వీరిద్దకూ కలిసి 48 బంతుల్లోనే 91 పరుగులు సాధించారు.