Tirumalagiri | ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు అడ్మీష‌న్ల వెల్లువ‌

తిరుమలగిరి, జూన్ 13 (ఆంధ్రప్రభ) : ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాల (Government school) ను బలోపేతం చేయాలనే శుభసంకల్పంతో ఉపాధ్యాయులు అందరూ సమిష్టిగా వేసవి సెలవుల కాలంలో ముందస్తుగా నూతన అడ్మిషన్ల కోసం 30రోజుల ప్రణాళికలను సిద్ధం చేసుకుని 4 టీములుగా ఏర్పడి ప్రధానోపాధ్యాయులు (Principals) దామెర శ్రీనివాస్ సారధ్యంలో మున్సిపాలిటీలో, ఇతర గ్రామాలలో ఇంటింటికి తిరిగారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులను గత సంవత్సరం ఉత్తీర్ణతను, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల వివరాలను, సౌకర్యాలను వివరించారు. తిరుమలగిరి (Tirumalagiri) జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించాలని 600 ఇండ్లకు వెళ్లగా.. బడి తెరిచిన రెండవ రోజుకు 100మంది విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి చేర్పించడంతో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆవిరాల కృషి అంకితభావంతో పనిచేయడంతో శ్రమకు తగిన ప్రతిఫలం దక్కింది. విజయ పరంపరలో సాగరంలాగా అద్భుతంగా అడ్మిషన్ల పర్వం కొనసాగుతుంది. సూర్యాపేట (Suryapet) జిల్లాలో నేటికీ శతక అడ్మిషన్లు చేర్పించిన ఏకైక పాఠశాల తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాత్రమే. వీరి బాటలో అన్ని పాఠశాలలు అడుగులు వేయాలని ఆశిద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *