రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం…

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం…
‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు**
గన్నవరం – ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవారం గన్నవరం గౌడపేటలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పి.యమ్. కిసాన్’ పథకం రైతులకు ఎంతో ఊరటనిస్తోందని అన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు విడతలుగా ఒక్కో రైతు ఖాతాలో మొత్తం రూ. 20,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన మూడవ విడత కింద రూ. 6,000 గన్నవరం నియోజకవర్గం వేదిక గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేశారని ఆయన గుర్తుచేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే వివరించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు, ఖర్చు తగ్గించే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను కూడా భారీ రాయితీ పై అందిస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, బాపులపాడు మండల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, విజయవాడ రూరల్ మండల టిడిపి అధ్యక్షులు గొడ్డళ్ల చిన్న రామారావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యం, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, బోడపాటి రవి, పుట్టా సురేష్, కుందేటి చంద్రశేఖర్, మేడేపల్లి రమ, అన్నే హరికృష్ణ, ఏయంసి వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు మద్దినేని వెంకటేశ్వరరావు, రంగారావు, కొమ్మురాజు సుధీర్, జాస్తి మురళి, జొన్నలగడ్డ సుధాకర్, తంగిరాల శ్రీనివాసరావు, బుస్సే నాగ ప్రసాద్, కొసరాజు సాయి, రంగబాబు, రఫీ, కొమ్మారెడ్డి రాజేష్, తిరువీధి నరేష్, సొంగా సంతోష్, బండి భాస్కర్, అద్దేపల్లి సాంబశివనాగరాజు, కొల్లా ఆనంద్, నబిగాని కొండయ్య, మోదుగుమూడి వేణుగోపాల్, మొవ్వ వేణుగోపాల్, లంకా అజయ్, కొల్లూరు చంద్రకాంత్, అట్లూరి శ్రీనివాసరావు, నాగబాబు, జనసేన పార్టీ నాయకులు చిమటా రవివర్మ, పచ్చిపాల లక్ష్మణరావు, బీజేపీ నాయకులు ఉయ్యూరు వెంకటేశ్వర రెడ్డి, టిడిపి నాయకులు మణిమాల వెంకట అప్పారావు, కాగితాల నాగరాజు, కోసూరు వెంకటేష్, కాటూరి విజయభాస్కర్, కంచర్ల సూర్యప్రకాష్ మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
