న్యూఢిల్లీ – ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు.. భారత్ లోని మతసామరస్యాన్ని చెడగొట్టేందుకు పాక్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలోని విదేశాంగ కార్యాలయంలో కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ లతో కలసి ఆయన నేడు మీడియాతో మాట్లాడారు.
ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధమని అన్నారు మిస్రి.. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాకిస్తాన్ కుట్రలు చేస్తుండటంతో ఇప్పటికే కర్తార్ పూర్ కారిడార్ మూసివేశామని వివరించారు. ఐఎంఎఫ్ సమావేశంలో పాకిస్తాన్ కు సహాయం చేయొద్దని కోరతాంమన్నారు.
పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు
పాక్ ఎయిర్ స్పేస్ ను మూసి వేయకుండా మనవైపు దాడులకు తెగబడుతున్నదని అన్నారు మిస్రి. అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్ సంయమనం పాటించింనదని అన్నారు. . భారత నగరాలు, విమానాశ్రయాలు మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని వివరించారు . ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతుందని పేర్కన్నారు. గత రాత్రి . లేహ్ నుంచి సర్ క్రిక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులు చేసిందని తెలిపారు. మన గురుద్వారాల మీద దాడి చేయడం ద్వారా దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని పాక్ ప్రయత్నించింది చెప్పారు.
పాక్ కు భారీ నష్టం
సరిహద్దుల్లో భారీ ఆర్టిలరీలతో పాకిస్తాన్ కాల్పులు జరపుతోందన్నారు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్.. భారత్ ఎదురు దాడిలో పాకి సైన్యానికి భారీ నష్టం జరిగిందని చెప్పారు. .. పౌర విమానాశ్రాయలను పాకిస్తాన్ రక్షణగా వాడుకొని దాడులకు దిగుతుందని మండిపడ్డారు. గత రాత్రి పాక్ మనపై దాడులు చేస్తున్న సమయంలో కరాచీ నుంచి లాహోర్ కు పౌరవిమానం ప్రయాణిస్తున్నది తెలిపారు. దీంతో మన వైమానికి దళం ఎటువంటి దాడులకు దిగకుండా సంయమనం పాటించిదన్నారు..
భారత మిలిటరీ లక్ష్యాలను పాకిస్తాన్ టార్గెట్
భారత గగనతలంలోకి గత రాత్రి పాకిస్తాన్ డ్రోన్లు.. యుద్ధ విమానాలు వచ్చాయన్నారు. వచ్చిన వాటిని వచ్చినట్లే కూల్చివేశామని వ్యోమికా సింగ్ చెప్పారు…. ప్రతిదాడుల విషయంలో భారత్ సంయమనం పాటించిందన్నారు… భారత మిలిటరీ లక్ష్యాలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని , సుమారు 300- 400 డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నించిందని తెలిపారు.. .. వాటిని సమర్థవంతంగా కూల్చేశామని చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. ఆ డ్రోన్ లు టర్కికి చెందినవిగా గుర్తించామని చెప్పారు.
డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాం..
నిన్న రాత్రి మన సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిందని వివరించారు కల్నల్ సోఫియా.. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశామని తెలిపారు. . ఈ డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. 4 ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించిందని, .. 36 చోట్ల చొరబాట్లకు యత్నించింది వెల్లడించారు. భటిండా, ఉధంపూర్ ఎయిర్ పోర్టులే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందన్నారు.