న్యూ ఢిల్లీ – పహల్గామ్లో మూడంచెల భద్రత ఉన్నప్పటికీ దాడి జరగడం వెనుక భద్రతా వైఫల్యాలపై సమగ్ర విశ్లేషణ అవసరం మని అభిప్రాయపడింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ . రాబోయే అమర్నాథ్ యాత్రకు లక్షలాది యాత్రికుల భద్రతను జాతీయ ప్రాధాన్యతగా పరిగణించి, బలమైన, పారదర్శక భద్రతా ఏర్పాట్లు చేయాలి కేంద్రాన్ని కోరింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అద్యక్షత నేడే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం డిల్లీ పార్టీ కార్యాలయంలో జరిగింది . ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది.
అలాగే ఈ దాడి పాకిస్తాన్ ప్రేరేపితం, హిందువులను లక్ష్యంగా చేసి దేశంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు జరిగిన కుట్ర అని పేర్కొంది. ఈ దాడి రెచ్చగొట్టే చర్య అయినప్పటికీ, ప్రజలు శాంతిని కాపాడాలి, ఐక్యంగా నిలబడాలి పిలుపునిచ్చింది. పర్యాటకులను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన స్థానిక పోనీవాలా, గైడ్లకు నివాళులు అర్పించింది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకంపై ఆధారపడిన ప్రజల జీవనోపాధిని రక్షించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సూచింది. ఈ విషాదాన్ని బీజేపీ సోషల్ మీడియా విభజన రాజకీయాల కోసం వినియోగిస్తోందని, ఐక్యత అవసరమైన సమయంలో ఇలాంటి పనులు దురదృష్టకరమని విమర్శించింది.
ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, సల్మాన్ కుర్షిద్, అంబికా సోనీ, ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.