Temple Rush | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Temple Rush | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Temple Rush | వారాంతపు సెలవులు, వేసవి విరామంతో పెరిగిన సందడి
అమ్మవారి ఆశీర్వాదం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులరాక
శనివారం 54,989 మంది భక్తులకు దర్శన భాగ్యం
7,750 మందికి అన్నదానం.. 75,951 ప్రసాదాల విక్రయం
కనకదుర్గమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ

Temple Rush | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వారాంతపు సెలవులు, ఇంకా కొనసాగుతున్న వేసవి విరామం కారణంగా ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పాఠశాలలు మరో వారం రోజుల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. శనివారం నమోదైన గణాంకాలు భక్తుల రద్దీ తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జూన్ 6న ఒక్కరోజే 54,989 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్ల ద్వారా 9,925 మంది ప్రత్యేక దర్శనం పొందగా, నగదు మరియు ఆన్‌లైన్ ద్వారా కలిపి 303 సేవలు నమోదయ్యాయి. అమ్మవారి ప్రసాదాలకు కూడా విశేష ఆదరణ లభించింది.

ఒకే రోజులో 75,951 ప్రసాదాలు విక్రయించబడగా, హుండీ విరాళాలు, ఇతర విరాళాల రూపంలో రూ.1.65 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. అదే విధంగా 2,579 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 7,750 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నదానం, తాగునీటి సదుపాయాలను మరింత విస్తృతంగా ఏర్పాటు చేశారు. సెలవుల సీజన్ ముగిసే వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. ఆధ్యాత్మిక భక్తి, కుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీస్సులు పొందాలనే ఆకాంక్షతో ఇంద్రకీలాద్రి భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.

CLICK HERE TO READ 65,394People | భక్తిపారవశ్యంలో ఇంద్రకీలాద్రి

CLICK HERE TO READ MORE

Leave a Reply