న్యూ ఢిల్లీ : శ్రీనగర్లో 2 పాక్ ఫైటర్ జెట్స్ భారత్ కూల్చి వేసింది.ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాక్ జెట్స్ ఆర్మీ కూల్చివేసింది.యుద్ధ విమానాలు కూల్చేసమయంలో పైలట్లు కిందకు దూకి వేశారు.
శ్రీనగర్ ప్రాంతంలో ల్యాండ్ అయిన పాక్ పైలట్లు కోసం భారత భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. పాక్ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టిన భారత రక్షణవ్యవస్థలు— సత్తాచాటిన S-400 డిఫెన్స్ సిస్టమ్ఆకాష్ మిసైల్, L-70, Zu-33, షిల్కా ముందు తేలిపోయిన పాక్.
పాక్ ఫతా-1 క్షిపణిని కూల్చివేసిన భారత్
వ్యూహాత్మక లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఫతా-1 క్షిపణిని పశ్చిమ సెక్టార్లో భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణుల దాడిః
పాక్రావల్పిండిలోని వైమానిక స్థావరంపై భారత యుద్ధ విమానాలు క్షిపణులను ప్రయోగించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు. ఈ దాడి రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచుతుందని అన్నారు
పాకిస్థాన్లోని ప్రధాన నగరాలే టార్గెట్!
ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా ఆరు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. షోర్కోట్లోని రఫికి ఎయిర్బేస్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్పై దాడి
పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో ఇస్లామాబాద్లోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ సమీపంలోని సెరెనా హోటల్పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
రావల్పిండిలో వరుస పేలుళ్లు
పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలో ఒకదాని తర్వాత ఒకటి మూడు పేలుళ్లు సంభవించాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ సమీపంలో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇదిలావుంటే, ఇస్లామాబాద్ నివాసితులు వరుసగా మూడు పేలుళ్ల శబ్దాలు విన్నారని తెలుస్తోంది. భారీగా నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, పోలీసులు, రెస్క్యూ బృందాలను సంఘటనా స్థలానికి పంపించారు.