హైదరాబాద్ ; భారతదేశంలో జరిగిన విమానాల ప్రమాదంలో {Flight Accidents) ప్రధానంగా పలువురు ప్రముఖ సెలబ్రిటీలు (Celebrities ) చనిపోయారు .. విమానాలు మాత్రమే కాదు హెలికాప్టర్ (Helicopter) ప్రమాదంలోనూ ఇలా చనిపోయిన వారు ఉన్నారు ..
ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి {YSR) సీఎంగా ఉండగానే హెలిక్యాప్టర్ క్రష్ అయి మరణించారు .. అలాగే అంతకుముందు లోక్సభ స్పీకర్ గా పనిచేసిన జి.ఎం.సి బాలయోగి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ..ఈ విమాన ప్రమాదాల్లో అత్యంత ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు .. భారత్ అనుశాస్త్రవేత్త ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోమి జహంగీర్ బాబా ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ ఆ విమాన ప్రమాదంలో మరణించారు .. అయితే ఇది 1966 లో జరిగింది .. ఈ ప్రమాదంలో మొత్తం 116 మంది మరణించారు హోమీ బాబా మరణం భారత్ అణు కార్యక్రమానికి ఎంతో తీరని లోటుగా మిగిలింది
.అలాగే 1973లో జరిగిన ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రమాదంలో భారతీయ ధనవంతుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా చనిపోయారు .. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో స్టీల్ మంత్రిగా ఈయన పని చేశారు .. అలాగే 1980లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయారు ..
అలాగే 1994 లో పంజాబ్గవర్నర్ అలాగే హిమాచల్ యాక్టింగ్ గవర్నర్ గా ఉన్న సురేందర్ నాథ్ తన కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సూపర్ కింగ్ విమానంలో ప్రయాణిస్తూ హిమాచల్ ప్రదేశ్ లోని పర్వతాల్లో కూలిపోవడంతో అక్కడికక్కడే మరణించారు.
అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి మాధవరావు సింధియా , , కాన్పూర్కు వెళుతున్న సమయంలో విమానం యూపీలో కూలిపోయి అక్కడికక్కడే మరణించారు . అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు లోక్సభ స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు . లోక్సభ స్పీకర్గా అతిని మరణం జాతీయ రాజకీయాల్లో తీవ్రమైన నష్టంగా మిగిల్చింది ..
అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సౌందర్య ఓ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి కరీంనగర్కు వెళుతున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ..
హర్యానా పవర్ మంత్రి , ప్రముఖ పారిశ్రామికవేత్త ఓ.పి. జిందాల్ , హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి సురేందర్ సింగ్ తో కలిసి ఢిల్లీ నుంచి చండీగఢ్కు హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో సాంకేతిక సమస్య కారణంగా హెలికాప్టర్ కూలిపోవడంతో మరణించారు .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్తూరు జిల్లాకు హెలికాప్టర్లో నల్లమల అడవులు వైపు వెళుతున్న సమయంలో అనుకోకుండా కూలిపోవడంతో మరణించారు .
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ, పవన్ హన్స్ హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా, గ్రౌండ్ కంట్రోల్తో సంబంధం కోల్పోయిన తర్వాత కూలిపోయింది. ఐదు రోజుల తర్వాత శిథిలాలు కనిపెట్టారు.
భారతదేశం మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, తన భార్య మధులికా రావత్తో సహా 12 మందితో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మి-17V5 హెలికాప్టర్ లో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.
ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలోవిజయ్ రూపానీ చనిపోయారు . ఈయన గుజరాత్ కు 2016 నుంచి 21 వరకు విజయ్ రూపానీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు