అనంతరం కెనడాకు పయనం కానున్న మోదీ
రేపు కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు
18 వ తేదిన క్రోయేషియా సందర్శన
న్యూ ఢిల్లీ – మూడు దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత సైప్రస్లో అడుగుపెట్టారు..అక్కడ జరిగే పలు కార్యక్రమాలలో ఆయన నేడు పాల్గొననున్నారు. 16 వరకు మోడీ సైప్రస్ పర్యటనలో ఉంటారు
అక్కడ పర్యటన ముగిసిన అనంతరం మంగళవారం నాడు కెనడాకు బయలుదేరి వెళ్తారు. 16-17 వరకు జీ-7 సమావేశంలో పాల్గొంటారు. కెనడాలో మంగళవారం జరగనున్న జీ7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొంటారు. ప్రపంచంలోని ఏడు ప్రధాన పారిశ్రామిక దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యులుగా ఉన్న ఈ కూటమి సమావేశంలో పలు అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. దీని తర్వాత జూన్ 18న క్రొయేషియాలో పర్యటిస్తారు. 19వ తేదిన ఆయన తిరిగి ఇండియాకు తిరిగివస్తారు.