Peddapalli | 10వ తరగతి పరీక్షలు ప్రారంభం.

పెద్దపల్లి ఆంధ్రప్రభ 10వ తరగతి పరీక్షలు పెద్దపల్లి జిల్లాలో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ నాలుగు తో ముగుస్తాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది , ఆశా సిబ్బంది, అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.

పెద్దపల్లి జిల్లాలో 10వ పరీక్షలకు 7393 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 41 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *