పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్, పీవోకేల్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం ఈ మెరుపు దాడులు చేసింది. దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, భారత్ మాతాకీ జై, ఆపరేషన్ సింధూ అంటూ హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే సమాజంలో ఏం జరిగినా సరే వెంటనే రియాక్ట్ అయ్యే సెలబ్రిటీలలో చిరంజీవి కూడా ఒకరు అని చెప్పవచ్చు .ఇక ఈయన ఈరోజు ఉదయమే ఆపరేషన్ సిందూర్ పై ట్వీట్ చేస్తూ..” జైహింద్” అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ స్పందించారు. ధైర్యం లేని చోట.. ధర్మం కోల్పోతారు. ధైర్యం లేని చోట స్వార్ధం రాజ్యమేలుతుంది. అంటూ హిందీలో రాసుకొచ్చారు. చాలాసేపు నిశ్శబ్దాన్ని భరించి “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారతదేశం మొత్తాన్ని మళ్ళీ శౌర్య స్ఫూర్తితో నింపిన త్రివిధ సైన్యాల ధైర్య నాయకత్వానికి, అలాగే వారికి అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడికి ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ స్పందిస్తూ.. “భారత్ మాతాకీ జై.. న్యాయం జరిగింది. జైహింద్” అంటూ ఖుష్బూ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. “యోధుడి పోరాటం ప్రారంభమవుతుంది… లక్ష్యం నెరవేరే వరకు ఆగదు! మొత్తం దేశం మీతోనే ఉంది..” అంటూ భారత సైన్యానికి ధైర్యాన్ని చేకూర్చేలా ఆపరేషన్ సింధూర్ పై స్పందించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. “భారత సైన్యానికి మరింత బలం, శక్తి చేకూరాలి” అంటూ ట్వీట్ చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ.. “న్యాయం జరిగింది జైహింద్” అంటూ ట్వీట్ చేశారు. హీరో కళ్యాణ్ రామ్ ‘ఆపరేషన్ సింధూర్’ పై స్పందిస్తూ..”మన రక్షణ దళాలకు మరింత బలం మరియు శక్తి చేకూరాలి. #ఆపరేషన్ సింధూర్ అనేది పిరికివాడికి సమాధానం. #పహల్గామ్ టెర్రర్ దాడి గౌరవం, సంకల్పం, జ్ఞాపకం. జై హింద్”అంటూ స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై నటుడు బ్రహ్మాజీ కూడా రియాక్ట్ అయ్యారు. జై హింద్ అంటూ ట్వీట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టు ఓ ఫోటోను కూడా యాడ్ చేశారు.