- క్వీన్ ఎలిజబెత్ తరువాత రామ్ చరణ్ ఏ
మెగా హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మైనపు విగ్రహంలో చరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ కూడా ఉండగా… క్వీన్ ఎలిజబెత్ తర్వాత పెట్ గాడ్ తో మైనపు విగ్రహం ఉన్న ఏకైక సెలబ్రిటీ రామ్ చరణ్ కావడం విశేషం.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, మేడమ్ టుస్సాడ్స్ తమ అభిమాన హీరో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మేడమ్ టుస్సాడ్స్ లో టాలీవుడ్ తారలు…
అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాలు ఉన్న టాలీవుడ్ హీరోల జాబితాలో రామ్ చరణ్ చేరాడు. మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం పొందిన టాలీవుడ్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.