ఢిల్లీ రైల్వే స్టేషన్లో (శనివారం) రాత్రి భారీ తొక్కిసలాట జరిగింది. మహా కుంభమేళా కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. దీంతో ప్లాట్ఫారమ్ నంబర్ 14, 15 వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై భారతీయ రైల్వే అధికారులు, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రద్దీని నియంత్రించేందుకు పత్రి ప్లాట్ ఫామ్ పై పోలీసులు మోహరించారు.