Suicide | కాలేజీలో ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు ఎన్​ఆర్​ఐ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి గ్రామానికి చెందిన గుర్రం వేణునాథ్ (18) ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇవాళ హాస్టల్​ గదిలో ఫ్యాన్​ కు ఉరేసుకుని మరణించాడు. వేణునాథ్​ మృతి గురించి కుటుంబ సభ్యులకు కాలేజీ సిబ్బంది తెలియజేశారు. కొడుకు ను విగత జీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ప్రేమ వ్యవహారమే వేణునాథ్​ ఆత్మహత్యకు కారణమని ఎన్ఆర్ఐ సిబ్బంది చెబుతున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్ దొరికిందని పేర్కొన్నారు. అయితే అందులోని చేతి రాత తమ అబ్బాయిది కాదని వేణునాథ్​ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *