హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ (gandhi bhavan ) ముందు గొల్ల, (golla,) కురుమ(kuruma) సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసనకు (protest ) దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ గొర్రెలు, మేకలకు వైద్య సదుపాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మొత్తం 30 గొర్రెలు, ఐదు మేకలతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు గాంధీభవన్కు చేరుకుని ధర్నా చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొదటి సారి కేబినెట్లో గొల్ల, కురుమలకు అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనూ అవకాశం దక్కలేదన్నారు. గాంధీభవన్లో నిరసన నేపథ్యంలో గొల్ల, కురుమల సామాజికవర్గ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చర్చలు జరిపారు. వారి వినతి పత్రం స్వీకరించి వారి గోడును విన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరితో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు.