Covid Count | త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా… కొత్త‌గా 163 కేసులు న‌మోదు

న్యూ ఢిల్లీ – దేశంలో కరోనా వైరస్‌ (Corona Virus ) కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా 300కిపైనే నమోదవుతున్న కేసులు (cases) ఇప్పుడు 200లోపే వెలుగు చూస్తున్నాయి. దీంతో క్రియాశీల కేసులు కూడా భారీగా తగ్గాయి.


కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా (data ) ప్రకారం.. గత 24 గంటల్లో 163 మందికి పాజిటివ్‌గా (positive) తేలింది. అత్యధికంగా ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 65 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రాజస్థాన్‌లో (rajasthan ) 51 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 6,483కి పడిపోయింది. అత్యధికంగా కేరళలో (kerala) 1384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 1105, పశ్చిమ బెంగాల్‌లో 747, కర్ణాటకలో 653, ఢిల్లీలో 620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 113కి పెరిగింది.

Leave a Reply