రోడ్డు కబ్జా చేసిన సెజ్ స్కూల్ యాజమాన్యం.. కబ్జా చేసిన ప్రాంతం కూల్చివేత…
మేడిపల్లి, (ఆంధ్రప్రభ) : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, మేడిపల్లి సర్వే నంబర్ 26ఏ, సిపీఆర్ఐ పవర్ సంస్థ ఎదురుగా, సెజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబందించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతం లో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు బుధవారం హైడ్రా అధికారులు చేరుకుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ. సైదులు నేతృత్వంలో జేసిబీలతో రోడ్డు అక్రమాణలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని,హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని ఆనందం వ్యక్తం చేశారు.