Vikarabad | జై బాబు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమంలో మహిళా నేత సునీతారావు

వికారాబాద్, మే 5 (ఆంధ్రప్రభ) : భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

అనంతరం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే విధంగా చేస్తుందని ఆమె ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్య‌క్ర‌మం చేపట్టినట్టు తెలిపారు. ఈకార్య‌క్ర‌మంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ జెడ్పిటిసి సంతోషరాజు మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *