తిరుమల నేటి సమాచారం..
తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి – తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,096 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి తలనీలాలు 26,289 మంది భక్తులు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లు.

