Tirumala | భ‌క్తుల‌కు స్వ‌యంగా వ‌డ్డన … వారితో పాటు అన్న‌ప్ర‌సాదం స్వీక‌రించిన అన్నా లేజినోవ‌

తిరుమ‌ల – కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి భార్య అన్నా లేజినోవ కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదల గారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ

స్వామి వారి దర్శనానంతరం అన్నా కొణిదల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ కోసం రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు.

భ‌క్తుల‌కు స్వ‌యంగా వ‌డ్డించిన లేజినోవ

అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

https://twitter.com/JanaSenaParty/status/1911679306751000712

Leave a Reply