అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.4,200 కోట్లకు పైగా విడుదల చేసిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడు అవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కలిసి అమరావతి రాజధాని నగర దశ-1 అభివృద్ధికి ఒక్కొక్కటి USD 1600 మిలియన్లు (రూ.13,600 కోట్లు), USD 800 మిలియన్లు నిధులు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాయి. అయితే అభివృద్ధి దశ-1 కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న రూ.15,000 కోట్లలో మిగిలిన రూ.1,400 కోట్లను కేంద్రం అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు పత్రాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం జనవరి 22 నుండి అమల్లోకి వచ్చింది. ప్రోగ్రామ్ అడ్వాన్స్ కోసం 205 USD మిలియన్ల మొదటి చెల్లింపు గత నెలలో జరిగింది. ఈ మొత్తం రూ. 15,000 కోట్లలో ప్రపంచ బ్యాంకు, ఎబిడి, కేంద్రం మధ్య భాగస్వామ్యం ఉంది.