న్యూ ఢిల్లీ – గ్రూప్-1 టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ కోరింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. ఇవాళ సింగిల్ బెంచ్లో విచారణ జరుగనున్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్లోనే పిటిషన్లపై తేల్చుకోవాలని ధర్మాసనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సూచించింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదంటూ అభ్యర్థులు ఆరోపించారు. రీకౌంటింగ్లో మార్కులు, టీజీపీఎస్సీ జారీ చేసిన మెమో మార్కులకు తేడాలున్నాయని పిటిషన్లు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 నియామకపత్రాలను ఇవ్వొద్దని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు టీజీపీఎస్సీని ఆదేశించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చని చెప్పారు. అయితే, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో టీజీపీఎస్పీ అప్పీల్ చేసింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నందున జోక్యం చేసుకునేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్పై విచారణను ముగించింది. మరో వైపు నేడు సింగిల్ బెంచ్లో గ్రూప్-1 పిటిషన్లపై విచారణ జరుగనున్నది.