హుజరాబాద్ టౌన్, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ) :కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొడంతో ద్విచక్ర వాహనదారుడి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు.
ప్రమాదంలో మృతుడి తల నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టనట్లు ఉందని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ తిరుమల గౌడ్ తెలిపారు.