శ్రీరామ నవమి సందర్భంగా రేపు (ఏప్రిల్ 06) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా భద్రాద్రి రాములవారిని దర్శించుకుంటారు. అయితే, ప్రభుత్వం తరపున సీఎంగా తొలిసారిగా రేవంత్ రెడ్డి సీతా రాములకు పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.
అనంతరం ప్రభుత్వం తరపున నిర్వహించే కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత భద్రాచలం నియోజకవర్గంలోని ‘సన్న బియ్యం’ లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం చేస్తారు.