TG | సీఎం రేవంత్ ని క‌లిసిన రాష్ట్ర‌ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు !

సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) సర్వేకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు.

పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనవాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ చాంబర్ లో సీఎం రేవంత్ ని కలిసి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply