Sports | పారా క్రీడాల‌లో నేత్ర విద్యార్దుల ప్ర‌తిభ – జాతీయ పోటీల‌లో ఏడు ప‌త‌కాలు కైవ‌సం

ఢిల్లీలో జరిగిన 2వ “ఖేలో ఇండియా-2025” పారా క్రీడలలో నేత్ర విద్యాలయం క్రీడాకారులు ఏడు ప‌త‌కాలు ద‌క్కించుకున్నారు.. ఢిల్లీ వేదికగా, జవహర్ లాలా నెహ్రూ స్టేడియంలో ఈ నెల 21 నుండి 23 వరకు “ఖేలో ఇండియా-2025” పారా గేమ్స్ నిర్వ‌హంచారు.. ఈ పోటీల‌లో త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మన నేత్ర విద్యాలయం విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల‌లో పోటీ ప‌డ్డారు. ఈ పోటీల‌లో రెండు స్వ‌ర్ణాలు, అయిదు ర‌జితాల‌తో మొత్తం ఏడు కైవ‌సం చేసుకున్నారు..

ఇండియా స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వహించిన ఈ పోటీలో భారతదేశంలోని 29 రాష్ట్రాలు పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు 10 పతకాలను సాధించాయి. అందులో “7” పతకాలను మన నేత్రవిద్యాలయం విద్యార్థులు సాధించటం విశేషం.

విజేతల వివరాలు

  1. కుమారి లలిత K. 200 మీటర్ల పరుగులో స్వర్ణం
  2. కుమారి రవని V. 100 మీటర్ల పరుగులో స్వర్ణం
  3. కుమారి లలిత K. 400 మీటర్ల పరుగులో ర‌జ‌తం
  4. కుమారి రవని V. 200 మీటర్ల పరుగులో రజతం
  5. కుమారి శిరీష 100 మీటర్ల పరుగులో ర‌జ‌తం
  6. . అంబటి స్వరాజ్ 100 మీటర్ల పరుగులో రజతం
  7. అంబటి స్వరాజ్ T 11, లాంగ్ జంప్ లో రజతం

పతకాల విజేత‌ల‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా స్పోర్ట్స్ అథారిటీ అభినందనలు తెలుపగా, శ్రీ చిన్నజీయర్ స్వామివారు తమ మంగళాశాసనములు కృపచేశారు.

Leave a Reply