Operation Sambhav success | ఆపరేషన్ సంభవ్ సక్సెస్…

Operation Sambhav success | ఆపరేషన్ సంభవ్ సక్సెస్…
- అల్లూ జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్.
చింతూరు / మారేడుమిల్లి / రంపచోడవరం, ఆంధ్రప్రభ : మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఆపరేషన్ సంభవ్ (Operation Sambhav) విజయవంతమైందని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ అన్నారు. బుధవారం ఉదయం 5 నుండి 5-.45 గంటల మధ్య పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పులలో ఏడుగురు మావోయిస్టులను మట్టు పెట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఏవోబీ సరిహద్దు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ రిక్రూట్ మెంట్ కోసం ఈ ప్రాంతాన్ని ఎన్నుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో కేంద్ర పారా మిలటరీ బలగాలు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సంభవ్ విజయవంతమైందన్నారు.
మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా 28 నుంచి 29 సార్లు చేసిన దాడుల్లో పోలీసులు, పర్యాటకులు, ప్రజలను హింసాత్మకంగా మృత్యువాతకు గురి చేశాడన్నారు. ప్రస్తుతం భద్రత బలగాలు విస్తృతంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారన్నారు.
చత్తీస్ గడ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుండి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని పక్కా సమాచారం తోనే మావోయిస్టులపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వరుస ఎన్ కౌంటర్ ల నేపథ్యంలో మావోయిస్టు లొంగిపోతున్నట్లు ఎటువంటి సమాచారం రాలేదన్నారు.
మృతి చెందిన మావోయిస్టుల వద్ద నుంచి రెండు ఏకే 47 లు, 5 ఏకే 47 మ్యాగజైన్లు, ఏకే 47కు చెందిన 72 రౌండ్లు, ఐదు ఎస్ బి బి ఎన్ తుపాకీలు, 34 బులెట్లు, 303 తుపాకీ, 24 బులెట్లు, మూడు కిలోల కార్డెక్స్ వైరు, 18 డిటోనేటర్లు, కిట్ బ్యాగులు లభించినట్టు ఆయన తెలిపారు.
మావోయిస్టు మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబాలకు మృతదేహాలను అప్పగిస్తామన్నారు. ఇప్పటికే మృతి చెందిన మావోయిస్టుల వివరాలను సేకరించి తమ కుటుంబాలకు సమాచారం అందించామన్నారు.
Operation Sambhav | టెక్ శంకర్ సహా ఏడుగురు హతం
అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో మరో ఎన్ కౌంటర్ తో దద్దరింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. బుధవారం తెల్లవారు జామున గుజ్జుమామిడి వలస అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోగా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. వీరందరూ దండకారణ్యంలోని చత్తీస్ గడ్ మావోయిస్టులే. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యులు ఉన్నారు.
మావోయిస్టు పార్టీ ఏవోబీ ఇంఛార్జ్, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు కు చెందిన మెట్టూరి జోగా రావు అలియాస్ టెక్ శంకర్, అలియాస్ శంకర్ బాబు, శివ. ప్రస్తుతం డీసీఎం సభ్యురాలు. మాజీ మావోయిస్టు చీఫ్ నంబాల కేశవ రావు అలియాస్ బీఆర్ దాదా గార్డ్ కమాండర్ సుకుమా జిల్లా (కిస్టారం ప్రాంతం) బూర్గులంక ప్రాంతానికి జ్యోతి అలియాస్ సరిత (32) , రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు, ఏ సిఎం, జగర గొండ ఎల్ ఓ ఎస్ , ఎఎస్ బి టి డీవీసీ..
, ఎర్రా కమ్యూనికేషన్ టీమ్లో పనిచేసిన సురేష్ అలియాస్ రమేష్, ఎస్ బీటీ డీవీసీ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ దాదాకు అంగరక్షకుడు , ఏసీఎం లోకేష్ అలియాస్ గణేష్, ఎఎస్ బి టి డీవీసీ డిప్యూటీ. కమాండర్, జాగర్ గొండ లాస్, ఏసీఎం, సైను అలియాస్ వాసు, జగర్ గొండ ఎల్ వోఎస్ , ఎఎస్ బీ టీ డీవీసీ గా పని చేసిన ఏసీఎం అనిత, జగరగొండ ఎల్ వో ఎస్ , ఎఎస్ బి టి డీవీసీ సభ్యురాలు, ఏసీఎం షమ్మీ మృతి చెందారు. .
Operation Sambhav | కూంబింగ్ యథాతథం
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. కాగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు.
మావోయిస్టులు ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు.. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశామన్నారు.
వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజినల్ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నట్టు చెప్పారు. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్ కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు.







