Makthal | వైభవంగా సీతారాముల కళ్యాణం – పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే వాకిటి

మక్తల్ , ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ)శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్త పి. ప్రాణేశాచారి , ఉడిపి పెజావార మఠం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ధర్మ ప్రచారక్ రాఘవేంద్ర ఆచార్య ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు ఇవాళ కనుల పండుగ కొనసాగాయి.

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి లలిత దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.అంతకు ముందు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి మంజుల దంపతులు బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అదేవిధంగా దామోదర జ్యువెలర్స్ తాళంపల్లి రమేష్ ,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గవినోళ్ళ రాధా లక్ష్మారెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందించారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తుల శ్రీరామ జయరామ జయజయ రామ అనే మంత్ర పఠనం మధ్య సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది.కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న భక్తులకు బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా ,రాజుల ఆశిరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి .గణేష్ కుమార్ , నాయకులు కొత్తకోట సిద్దార్థ రెడ్డి, కట్ట సురేష్ కుమార్,బోయ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *